రౌడీ హీరోని పాన్ ఇండియా డైరెక్టర్ ఎందుకు కలిశాడంటే!

సలార్ 2 లో విజయ్ దేవరకొండ నటిస్తున్నాడా? లేదంటే రౌడీ హీరోతో ప్రశాంత్ నీల్ మూవీ చేయబోతున్నాడా? పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్ విజయ్ ఇంటికెళ్లిమరీ ఎందుకు కలిశాడు?

రౌడీ హీరోని కలసిన పాన్ ఇండియా డైరెక్టర్
ఈ మధ్యే ఫ్యామిలీ స్టార్ మూవీతో వచ్చాడు విజయ్ దేవరకొండ. పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో మృణాళ్ ఠాకూర్ హీరోయిన్. ప్రస్తుతం విజయ్ …జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత సుకుమార్ తో ఓ మూవీకి కమిటయ్యాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో మూవీ అంటూ ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే హైదరాబాద్ వచ్చిన ప్రశాంత్ నీల్ … విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్ళాడట. దీంతో ఇద్దరి కాంబినేషన్లో మూవీ అంటూ పుకార్లు మొదలయ్యాయి.

గెస్ట్ రోల్ ఏమైనా!
విజయ్-ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ అన్నది రూమర్ మాత్రమే అంటున్నారు ప్రశాంత్ నీల్ టీమ్. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సలార్ 2 ప్రీ ప్రొడక్షన్ వర్కులో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత యంగ్ టైగర్ తో ప్రాజెక్ట్ పట్టాలెక్కించాలి. ఈ రెండు పూర్తవ్వాలంటే కనీసం మూడేళ్లు పడుతుంది. ఈ రెండింటి తర్వాత రామ్ చరణ్ తో ఓ మూవీ ఉందనే టాక్ వినిపిస్తోంది. ఈ లెక్కన విజయ్ దేవరకొండతో కొత్త ప్రాజెక్ట్ అనే మాటే లేదంటున్నారు. అయితే త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న సలార్ 2 లో కానీ, ఎన్టీఆర్ మూవీలో కానీ మరో హీరోగా నటించమనే ఆఫర్ ఏమైనా ప్రశాంత్ నీల్ ఇచ్చాడా అనే డిస్కషన్ కూడా నడుస్తోంది.

ఒడ్డున పడాల్సిన టైమ్
లైగర్ సినిమాతో విజయ్‌కి మాస్ ఇమేజ్ ఇద్దామని పూరి జగన్నాథ్‌ ట్రై చేశాడు కానీ అంతగా వర్కౌట్ కాలేదు. విజయ్ కెరీర్లో భయంకరమైన డిజాస్టర్ గా మిగిలింది. ఆ తర్వాత వచ్చిన ఖుషి కొంత ఉపశమనం ఇచ్చింది కానీ మళ్లీ ఫ్యామిలీ స్టార్ డిస్సప్పాయింట్ చేసింది. మరి గౌతమ్ తిన్ననూరితో వస్తోన్న మూవీ సక్సెస్ అయితే విజయ్ ఒడ్డున పడ్డట్టే. ఇంతకీ ఏ కారణం లేకుండానే ప్రశాంత్ నీల్ …విజయ్ దేవరకొండని కలిశాడా?