పోస్టల్ బ్యాలెట్లపై క్లారిటీ – ఎలక్షన్ డ్యూటీ చేసేవాళ్లకు ఈసీ సూచనలూ !

ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు వారి పోస్టల్‌ బ్యాలెట్‌ ఫారమ్‌ నెంబరు 12ను సమర్పించే తేదీని ఈ నెల 26 వరకు పొడిగించారు. మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 22 వరకు పోస్టల్‌ బ్యాలెట్‌ సమర్పించేందుకు చివరి తేదీ అనే ప్రచారంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటి వరకు చాలా మందికి పోస్టల్‌ బ్యాలెట్లు అందకపోవడం, ఏ జిల్లాలో ఓటు వేయాలో లేదా ఏ నియోజకవర్గంలో సమర్పించాలో తెలియక చాలా మంది ఉద్యోగుల్లో అయోమయం నెలకొంది.

మూడున్నర లక్షల మంది పోలింగ్ సిబ్బంది

పోలింగ్ విధుల్లో మూడు లక్షల 30 వేల మంది వరకూ పాల్గొంటున్నారు. వీరందరికీ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాల్సి ఉంటుంది. ఇందు కోసం ఈసీ ఏర్పాట్లు చేసింది. ముందుగా పోలింగ్ సిబ్బంది దరఖాస్తు కోసం ఈ నెల 22 వరకూ గడువు ఇచ్చింది. దరఖాస్తులు ఇచ్చారు కానీ.. వాటిని సమర్పించే విషయంలో మాత్రం అధికారులు మాకు కాదు..మాకు కాదు అని గందరగోళం సృష్టించాుర. ఫలితంగా పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవాలనకుంటున్న పోలింగ్ సిబ్బంది అయోమయానికి గురయ్యారు. పోలింగ్ సిబ్బందికి శిక్షణ సమయంలో పోస్టల్ బ్యాలెట్లు ఇచ్చారు. వివరాలు నింపిన తర్వాత వాటిని వెనక్కి తీసుకున్నారు. తర్వాత వారికి ఓటు హక్కు ఉన్న నియోజకవర్గంలో ఇవ్వాలంటూ ఫాం 12 ఇచ్చారు. ఉద్యోగులు వివిధ కారణాలతో తాము పని చేస్తున్న చోట కాకుండా ఇతర చోట ఓటు హక్కు కలిగి ఉంటారు. అయినప్పటికీ చాలా మంది తమ ఫాం 12 తీసుకెళ్లి రిటర్నింగ్ అధికారులకు ఇస్తూంటే.. తమకు కాదని.. ఫాం 12 ఎవరు ఇచ్చారో వారికే ఇవ్వాలని అంటున్నారు. తీసుకోవడం లేదు. దీంతో గందరగోళం ఏర్పడింది.

ఉద్యోగుల ఆందోళనతో గడువు పెం పు

ఉద్యోగులు ఎక్కడ పనిచేస్తుంటే అక్కడే ఫారం-12ను పూర్తి చేసి, అక్కడే సమర్పించాల్సి ఉంటుంది. ఇతర జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ ఫస్ట్‌ సెంట్రల్‌ ఎక్స్ఛేంజ్‌ను ఈ నెల 28న సచివాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. ఎక్స్ఛేంజ్‌-2 ఓటు వేయని పోస్టల్‌ బ్యాలెట్లు మే 3న, మే 8న ఫెసిలిటేషన్‌ సెంటర్‌లో సమర్పించాల్సి ఉంటుంది. ఉపయోగించని బ్యాలెట్లు, మిగిలిపోయిన వాటిని మే 10న వెలగపూడిలోని కలెక్టర్ల సమావేశం హాలులో నోడల్‌ అధికారులకు అప్పజెప్పి రసీదులు తీసుకోవాల్సి ఉంటుందని సిఇఒ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మే 8లోపు ఓటు హక్కు వినియోగించుకోని వారు తర్వాత ఓటు హక్కును వినియోగించుకునే హక్కు ఉండదని పేర్కొన్నారు. అన్ని బ్యాలెట్‌ పేపర్లు అనెగ్జర్‌-6తో సహా వాటిని స్ట్రాంగ్‌ రూమ్స్‌లో భద్రపరచాల్సి ఉంటుంది.

ఈసీ చొరవ

సాధారణంగా నిబంధనల ప్రకారం ఓటు హక్కు ఉన్న మండలంలో ఫాం 12 సమర్పించే అవకాశం ఉంటుంది. కానీ ఈ సారి మాత్రం అందరూ ఒకరిపై ఒకరు చెప్పుకుని పోస్టల్ బ్యాలెట్లు తీసుకోవడం లేదు. గడువు ఈ నెల 22 వరకే ఉండటంతో.. వాటిని ఎవరికి సమర్పించాలో తెలియక చాలా మంది పోలింగ్ సిబ్బంది సతమతమయ్యారు. చివరికి సమస్య పరిష్కారం అయింది.