ఫలిస్తున్న చంద్రబాబు బుజ్జగింపులు – అనంతపురం కూటమి దారికొచ్చినట్లేనా ?

అనంతపురం టిడిపిలో చెలరేగిన అసమ్మతి చల్లారిన సూచనలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా అనంతపురం, గుంతకల్లు నియోజకవర్గాలకు సంబంధించి మాజీ ఎమ్మెల్యేలు ప్రభాకర్‌ చౌదరి, జితేందర్‌ గౌడ్‌లు అసంతృప్తితో ఉన్నారు. టిక్కెట్టు ఖరారవలేదన్న విషయం తెలిసిన వెంటనే రెండు నియోజకవర్గాలల్లో టిడిపి కార్యాలయాలపై దాడి చేసి ఫర్నీచర్లు ధ్వంసం చేశారు.

ఇండిపెండెంట్లుగా పోటీ చేసేందుకు సన్నాహాలు

స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు ప్రభాకర్ చౌదరి, జితేందర్ గౌడ్ ఏర్పాట్లు చేసుకున్నారు. పార్టీని వీడబోమన్న విషయాన్ని మాత్రం ఆ ఇద్దరు నేతలు ప్రకటించారు. ఈ క్రమంలో టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ప్రభాకర్‌ చౌదరి, జితేందర్‌ గౌడ్‌లను పిలిచి మాట్లాడారు. దీంతో వారు కొంత మెత్తబడినట్టు సన్నిహితులు చెబుతున్నారు. అయితే వారికి ఎటువంటి హామీ లభించిందన్నది చర్చ నడుస్తోంది.

పార్టీ పదవులు ఇచ్చేందుకు సిద్ధమైన చంద్రబాబు

పార్టీ బాధ్యతలు ఈ నేతలకు అప్పగించినట్టు పార్టీలో చర్చ నడుస్తోంది. ప్రభాకర్‌ చౌదరికి రాయలసీమ బాధ్యతలు అప్పగించనున్నారని ప్రచారం నడుస్తోంది. జితేందర్‌ గౌడ్‌కు జిల్లా బాధ్యతలు అప్పగించే సూచనలున్నట్టు తెలుస్తోంది. ఈ హామీతోపాటు ఇంకేమైనా ఇచ్చారా అన్నది తెలియాల్సి ఉంది. నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంతోపాటు వచ్చే ఎన్నికల్లో విజయానికి కృషి చేయాలని సూచించినట్టు తెలుస్తోంది. ఇద్దరు సీనియర్‌ నాయకులే కావడంతో వారి నియోజవర్గాల్లో మంచి పట్టున్న నేతలు కూడా. వీరు అభ్యర్థులతో కలిసి పనిచేస్తే పార్టీని సానుకూల పరిస్థితులే ఉండనున్నాయి. ఇదే రకమైన అసంతృప్తి ఉన్న శింగనమల నియోజకవర్గం నేతలతో ఇది వరకే చంద్రబాబు మాట్లాడారు. దీంతో శింగనమలలో వ్యతిరేకంగానున్న ఆలం నరసానాయుడు, కేశవరెడ్డిలు ఇప్పుడు మౌనంగా పనిచేసుకునిపోతున్నారు. దీంతో అసమ్మతి కనిపించడం లేదు.

మడకశిరలో సర్దుబాటు కాని అసమ్మతి

అయితే మడకశిరలో ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అభ్యర్థి సునీల్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామికి మధ్య పడటం లేదు. లో అభ్యర్థిని మార్చాలని పట్టుబడుతున్నారు. అసంతృప్తి తీవ్రంగా ఉన్న కళ్యాణదుర్గం, కదిరిల్లో ఇప్పటికే అసమ్మతి నేతలు పార్టీని వీడిపోయారు. వారు బయటకు పోవడంతో తక్కిన వారు పార్టీ కోసం పనిచేసే వారు ఉండిపోయారు. అనంతపురం, గుంతకల్లు అదినేత హామీతో సద్దుమణిగినట్టయింది.