ధర్మవరంలో బీజేపీ బలగం – సత్యకుమార్ కోసం విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి పోటీ చేస్తున్న జాతీయ కార్యదర్శి సత్యకుమార్ గెలుపు కోసం బీజేపీ బలగం రంగంలోకి దిగింది. నియోజవకర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నేతలందర్నీ సమన్వయం చేసుకుని .. క్యాడర్ ఇంటింటికి వెళ్లేలా కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. ఈ బాధ్యతల్ని ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి తీసుకున్నారు.

క్యాడర్ ను ఏకతాటిపైకి తెచ్చేలా విష్ణు కార్యాచరణ

సత్యకుమార్ విజయం కోసం బీజేపీ పక్కా వ్యూహం ఖరారు చేసుకుంది. అందులో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా కీలకంగా ఉన్న నేతలందరితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. టీడీపీ , జనసేన నేతలని కలుపుకుని వెళ్తూ…. ఇంటింటి ప్రచారం చేయడానికి ప్రత్యేక ప్లాన్ రెడీ చేశారు. ప్రత్యేక సమావేశం పెట్టి.. విష్ణువర్ధన్ రెడ్డి అందరికీ దిశానిర్దేశం చేశారు.

ప్రచారాన్ని సమన్వయం చేయనున్న విష్ణువర్ధన్ రెడ్డి

కేంద్ర ప్రభుత్వ విజయాలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో గతంలో అనంతపురం జిల్లాలో విస్తృత పోరాటాలు చేసిన విష్ణువర్ధన్ రెడ్డికి .. ధర్మవరంలో విస్తృతమైన పరిచయాలు ఉన్నాయి. అలాగే క్యాడర్ తో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సత్యకుమార్.. నియోజకవర్గానికి.. జిల్లాకు కొత్త వాడు అయినప్పటికీ.. ఆ లోపం కనిపించకుండా ప్రజలంతా సత్యకుమార్ ను ఓన్ చేసుకునేలా ప్రత్యేక ప్రచారం నిర్వహిస్తున్నారు.

కూటమి పార్టీల్ని కలుపుకుంటూ గెలుపు దిశగా !

సత్యకుమాార్ తొలిి సారి ఎన్నికల బరిలో నిలిచారు. గతంలో ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలబడలేదు. అయినప్పటికీ ఆయనకు ఆ లోటు తెలియకుండా అనంతపురం జిల్లా బీజేపీ క్యాడర్ అంతా సహకరిస్తున్నారు. అనంతపురం జిల్లాకే చెందిన విష్ణువర్ధన్ రెడ్డి.. సత్యకుమార్ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.