నాగచైతన్యతో సందీప్ వంగా..అర్జున్ రెడ్డిని మించి!

సౌత్-నార్త్ ఎక్కడ చూసినా ‘యానిమల్’ మూవీ ఫీవర్ మూమూలుగా లేదు. ఈ జోష్ లో ఉన్న సందీప్ వంగా తన నెక్స్ట్ ప్రాజెక్టులేంటే వరుసగా చెప్పేస్తున్నాడు. అయితే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే..అసలు తన ఫస్ట్ ప్రాజెక్ట్ నాగచైతన్యతో అవాల్సిందంటూ షాకిచ్చాడు…

సందీప్ వంగా…ఇప్పుడిది ఓ బ్రాండ్.రణబీర్ కపూర్, రష్మిక జంటగా సందీప్ వంగా తెరకెక్కించిన యానిమల్ క్రేజ్ థియేటర్లలో ఓ రేంజ్ లో ఉంది. మెచ్చుకునే వాళ్లు మెచ్చుకుంటున్నారు,తిట్టేవాళ్లు తిడుతున్నారు. సోషల్ మీడియా హోరుతో పాటూ పార్లమెంట్ లోనూ ఈ మూవీపై డిస్కషన్ జరిగింది. ఎవరి రియాక్షన్ ఎలా ఉన్నా…యానిమల్ తర్వాత ఇండియాలో మోస్ట్ వాంటెడ్ టాప్ డైరెక్టర్స్ లిస్టులో టాప్ 5 లో చేరిపోయాడు సందీప్. చేసింది చాలా తక్కువ సినిమాలే అయినా యూత్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. తర్వాత మూవీ ప్రభాస్ తో చేయబోతున్నాడు. మరి నాగచైతన్య ప్రస్తావన ఎందుకొచ్చిందంటే…

ఫస్ట్ మూవీ నాగ చైతన్యతో
సందీప్ వంగా అర్జున్ రెడ్డి కన్నా ముందు నాగచైతన్యతో మూవీ చేయాలని ప్లాన్ చేసుకున్నాడట. అర్జున్ రెడ్డి కన్నా బోల్డ్ కంటెంట్ ఉన్న స్టోరీ లైన్ అట. అయితే ఓ పెద్ద కుటుంబానికి చెందిన వారసుడు హద్దులు దాటి బోల్డ్ కెంటెంట్ తో వస్తే ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో అనే ఆలోచనతో ఆ సినిమా చేసేందుకు ధైర్యం చేయలేదట సందీప్.ఆ స్టోరీ చైతూ కోసమే దాచా – సందీప్ ఆ స్టోరీ అప్పట్లో తెరకెక్కించేందుకు కుదరకపోయినా అది మాత్రం నాగచైతన్య కోసం దాచిపెట్టి ఉంచాడట. ఇప్పటివరకూ ఆ స్టోరీ వేరే హీరోకి చెప్పలేదని…ఎఫ్పటికైనా నాగచైతన్య తోనే ఆ మూవీ తెరకెక్కిస్తానని క్లారిటీ ఇచ్చాడు సందీప్ వంగా.

రియల్ అర్జున్ రెడ్డి శర్వానంద్!
అర్జున్ రెడ్డి మూవీ కూడా ముందు విజయ్ దేవరకొండతో కాకుండా శర్వానంద్ తో చేయాలనుకున్నాడట. ఆ స్టోరీ విన్న శర్వానంద్…వామ్మో నావల్ల కాదన్నాడట. అప్పుడే పెళ్లిచూపులుతో విజయ్ దేవరకొండ హిట్టందుకోవడంతో సందీప్ చూపు దేవరకొండపై పడింది. ఆ మూవీతో విజయ్ దేవరకొండ దశతిరిగింది..

స్పిరిట్ తో బిజీ
యానిమల్ సక్సెస్ జోరులో ఉన్న సందీప్ వంగా త్వరలో ప్రభాస్ తో స్పిరిట్ తెరకెక్కించనున్నాడు. ఆ తర్వాత అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో కమిట్ అయిపోయాడు. అవన్నీ అయ్యాక చైతూతో మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. అయితే ఎప్పుడొస్తుందన్నది క్లారిటీ లేదు కానీ నాగచైతన్యతో సందీప్ వంగా మూవీ రావడం మాత్రం పక్కా…