ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మూవీ స్టోరీ ఇదే!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మూవీతో బిజీగా ఉన్నాడు..ఆ తర్వాత బాలీవుడ్ మూవీ వార్ 2 పై కాన్సన్ ట్రేట్ చేయనున్నాడు. ఈ రెండు ప్రాజెక్టుల తర్వాత త్రివిక్రమ్ తో మూవీ ఉండబోతోంది అంటున్నారు…సేమ్ టైమ్ ప్రశాంత్ నీల్ తో సినిమాకూడా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుందని టాక్. తారక్-ప్రశాంత్ నీల్ మూవీ స్టోరీకి సంబంధించిది స్టోరీ ఇదేనంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడమే ఇంట్రెస్టింగ్ అప్ డేట్..

శౌర్యంగ పర్వం తర్వాత NTR తో మూవీ
KHF సిరీస్ తో దేశవ్యాప్తంగా పాపులార్టీ సొంతం చేసుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కన్నడ భాష నుంచి వచ్చిన KGF ప్రపంచ వ్యాప్తంగా 1200 కోట్లు కలెక్ట్ చేసిన చిత్రంగా చాప్టర్2 అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ప్రశాంత్ నీల్ మూవీ అంటే పవర్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ కథతో పాటుగా. హీరో ఎలివేషస్ సీక్వెన్స్ కచ్చితంగా ఉంటాయని ఫిక్సైపోయారు సినీ ప్రియులు. వాటికి తగ్గా BGM తో థియేటర్లలో మోత మోగించడంలో సక్సెస్ అయ్యాడు ప్రశాంత్ నీల్. గతేడాది ఆఖరులో వచ్చిన డార్లింగ్ ప్రభాస్ సలార్ మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దీనికి కొనసాగింపుగా పార్ట్ 2 శౌర్యంగ పర్వం త్వరలో సెట్స్ పైకి వెళ్లబోతోంది. సలార్ పార్ట్ 2 మీద భారీ అంచనాలున్నాయి. మొదటి పార్ట్ 700 కోట్లకి పైగా కలెక్షన్స్ అందుకుంది. పార్ట్ 2తో వెయ్యి కోట్లకి పైగా వసూళ్లు సాధించాలనే లక్ష్యంతో ఉన్నారు మూవీ టీమ్. దీని తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కించబోయే మూవీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తోనే. వచ్చే ఏడాది పట్టాలెక్కబోతున్న ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది

ఎన్టీఆర్ మూవీ స్టోరీ ఇదే
2025 లో సెట్స్ పైకి వెళ్లబోయే ఈ మూవీ KGF లానే హైవోల్టేజ్ పవర్ యాక్షన్ ప్యాక్డ్ స్టోరీతోనే ఉండబోతోందట. ఇండియన్ మైథాలజీలోని క్యారెక్టర్స్ స్ఫూర్తితో ప్రశాంత్ నీల్ ఈ కథని సిద్ధం చేస్తున్నాడని టాక్. ఈ మూవీ కూడా రెండు భాగాలుగానే భారీ బడ్జెట్ తో తెరకెక్కించే ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలుగా వ్యవహరించబోతున్నారు. తారక్ కెరీర్లో గుర్తుండిపోయేలా ఈ మూవీని తీయబోతున్నాడట ప్రశాంత్ నీల్.

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర మూవీలో నటిస్తున్నాడు. ఈ షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. దీని తర్వాత హిందీలో వార్ 2 మూవీ షూటింగ్ లో జాయిన్ అవుతాడు. వార్ 2లో కాస్తా నెగిటివ్ షేడ్స్ ఉన్న హీరోగా తారక్ కనిపిస్తాడని టాక్. దీని తర్వాత ప్రశాంత్ నీల్ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఈలోగా ప్రశాంత్ నీల్ కూడా శర్యంగపర్వం పూర్తి చేసేస్తాడు..ఈ లెక్కన 2026 లో ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ ఉండబోతోందన్నమాట..