వేలంలో లేడీ ‘విరాట్‌’ను దక్కించుకున్న బెంగళూరు.. స్మృతి కోసం ఎన్ని కోట్లు వెచ్చించారంటే?

వేలం మొదట టీమిండియా స్టార్‌ ప్లేయర్‌ స్మృతి మంధానతో ప్రారంభమైంది. గత కొన్నేళ్లుగా అన్ని ఫార్మాట్లలో పరుగుల వర్షం కురిపిస్తోన్న ఈ లెఫ్ట్‌ హ్యాండర్‌ బ్యాట్‌ను దక్కించుకోవడానికి అన్ని ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి.

క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ (WPL) వేలం మొదలైంది. ముంబై వేదికగా జరుగుతున్న ఈ యాక్షన్‌లో మొత్తం 409 మంది ఆటగాళ్లు తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. ఈ వేలం మొదట టీమిండియా స్టార్‌ ప్లేయర్‌ స్మృతి మంధానతో ప్రారంభమైంది. గత కొన్నేళ్లుగా అన్ని ఫార్మాట్లలో పరుగుల వర్షం కురిపిస్తోన్న ఈ లెఫ్ట్‌ హ్యాండర్‌ బ్యాట్‌ను దక్కించుకోవడానికి అన్ని ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. చివరకు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుస్మృతిని దక్కించుకుంది. ఇందుకోసం ఏకంగా రూ.3.40 కోట్లను వెచ్చించింది.

ఈ వేలంలో స్మృతి బేస్ ప్రైస్ కనీసం రూ. 50 లక్షలు కాగా ముంబై ఏకంగా రెండు కోట్లకు బిడ్ చేసింది.  ఇతర ఫ్రాంఛైజీలు కూడా భారీ ధరను బిడ్ చేశాయి. అయితే మహిళల క్రికెట్లో లేడీ విరాట్ గా పేరున్న స్మృతిని దక్కించుకోవడానికి బెంగళూరు ఏకంగా రూ.3.40 కోట్లు వెచ్చించింది. కాగా ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ టీ20 బ్యాటర్లలో స్మృతి మంధాన ఒకరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *