తమిళనాడులో లోకేష్ ప్రచారం – అన్నామలైకు సపోర్టుగా పర్యటన

తమిళనాడు రాష్ట్ర భాజపా అధ్యక్షుడు, కోయంబత్తూరు లోక్‌సభ అభ్యర్థి అన్నామలై కుప్పుస్వామికి మద్దతుగా తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ప్రచారం చేయనున్నారు. గురు, శుక్రవారాల్లో ఆయన కోయంబత్తూరులో పర్యటించనున్నారు. తెలుగువారు అధికంగా నివసించే ప్రాంతాల్లో నిర్వహించే సభలు, సమావేశాలు, రోడ్‌షోల్లో పాల్గొంటారు.

గురు, శుక్రవారాల్లో పర్యటన

గురువారం రాత్రి 7 గంటలకు పీలమేడులో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు. సింగనల్లూరులోని ఇందిరా గార్డెన్స్‌లో శుక్రవారం ఉదయం తెలుగు పారిశ్రామికవేత్తలతో లోకేశ్‌ సమావేశమవుతారు. ఇందులో భాగంగా తాజాగా రెండురోజుల టూర్‌లో భాగంగా నారా లోకేష్ తమిళనాడు వెళ్తున్నారు. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై కోయంబత్తూరు నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. ఆయన తరపున ప్రచారం చేసేందుకు అక్కడికి వెళ్తున్నారు నారా లోకేష్.

తెలంగాణలో తెలుగువారి ప్రాబల్యం ఎక్ుకవ

రెండురోజుల పాటు యువనేత అక్కడే మకాం వేయనున్నారు. దక్షిణ తమిళనాడులో తెలుగువారి ప్రాబల్యం అధికంగా ఉంటుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన చాలామంది ప్రజలు అక్కడ స్థిరపడ్డారు. ఈ విషయాన్ని గమనించిన తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై.. బీజేపీ హైకమాండ్ ద్వారా రాష్ట్ర నాయకత్వానికి సమాచారం పంపారు.

తమిళనాడులో ఫేమస్ లీడర్ గా ఎదుగుతున్న అన్నామలై

తక్కువ సమయంలో తమిళనాడులో ఫేమస్ అయ్యారు అన్నామలై .కోయంబత్తూరు నుంచి ఆయన హాట్ ఫేవరేట్ గా ఉన్నారు. కోయంబత్తూరులో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడిన వ్యాపారాలు చాలా మంది ఉన్నారు. ఈ కారణంగా బీజేపీ మద్దతుదారులైన ఇతర పార్టీల నేతల్ని కూడా ప్రచారానికి ఆహ్వానిస్తున్నారు.