వైసీపీ నేతల బూతులకు విష్ణువర్ధన్ రెడ్డి ఘాటు కౌంటర్లు – గీత దాటకుండానే వాతలు !

బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాపై నోరు పారేసుకుంటున్న వైఎస్ఆర్‌సీపీ మాజీ మంత్రులు పేర్ని నాని ,, కొడాలి నానిలకు ఏపీ బీజేపీ ప్రదాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఘాటు కౌంటర్లు ఇస్తున్నారు. గీత దాటకుండానే వారికి ఇస్తున్న కౌంటర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా… తిరుపతి బహిరంగసభలో ప్రభుత్వంపై అనేక విమర్శలు చేశారు. అవి అవాస్తవమైతే వివరాలు బయటపెట్టాలి కానీ.. వ్యక్తిగతంగా తూలనాడేందుకు… నానిల గొలుసు విప్పారు వైసీపీ పెద్దలు. అంతే వారు చెలరేగిపోయారు.

వ్యక్తిగతంగా దూషిస్తే బీజేపీ నేతలు భయపడతారా ?

వైసీపీ స్ట్రాటజీ మొదటి నుంచి ఒకటే. రాజకీయంగా విమర్శలు చేస్తే… వ్యక్తిగతంగా దాడి చేస్తారు. కుటుంబసభ్యులను కూడా తీసుకొచ్చి బూతులు తిడతారు. ఇలాంటి రాజకీయాల కారణంగా చాలా మంది వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడేందుకు సంకోచించే పరిస్థితి ఏర్పడింది. సూపర్ స్టార్ రజనీకాంత్ ను కూడా వారు వదిలిపెట్టలేదు. జేపీ నడ్డాపైనే అలాగే తమ భాషా ప్రయోగం చేశారు. పేర్ని నాని అధికారికంగా పార్టీ ఆఫీసులో కూర్చుకుని అడ్డోగలుగా మాట్లాడారు. కొడాలి నానితో మరో రకంగా మాట్లాడి సాక్షిలో ప్రసారం చేశారు. అయితే ఇలాంటి ఉడత ఊపులకు భయపడేది లేదని బీజేపీ నేతలు ఘాటు కౌంటర్ల ద్వారా తేల్చి చెప్పారు.

షెడ్డుకు పంపించినా ఆ నేతలకు అర్థం కాలేదా ?

పేర్ని నాని, కొడాలి నానిలు కేబినెట్‌లో ఉంటే కళంకం అని.. జగన్ వారిని తీసేశారు. కానీ వారికి ఉన్న ఇమేజ్.. భాషా పాటవాన్ని మాత్రం వాడుకుంటున్నారు. ఇద్దర్ని అవసరమైనప్పుడల్లా గొలుసులు విప్పి మీడియా ముందు కూర్చోబెడుతున్నారు. వారు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. అయితే ఓ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ నేతలకే అంత ఉంటే కేంద్రంలో ఉన్న బీజేపీ నేతలకు ఇంకెంత ఉండాలి….? అయితే బీజేపీ నేతలు ఎక్కడా గీత దాటలేదు.. గీత దాటకుండానే వాతలు పెట్టారు.

విష్ణు వర్ధన్ రెడ్డి కౌంటర్లు సోషల్ మీడియాలో వైరల్

ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఇచ్చిన కౌంటర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వారు చేసిన అనుచిత వ్యాఖ్యల దగ్గర్నుంచి … స్టీల్ ప్లాంట్ వంటి విధానపరమైన అంశాల వరకూ అన్నింటికీ కౌంటర్లు ఇచ్చారు. బీజేపీ నేతలు మాత్రం.. వైసీపీ నేతల్లా వ్యక్తిగత విమర్శల జోలికి వెళ్లలేదు. పార్లమెంటరీ భాషలోనే సమాధానం చెప్పారు.