రామ్ చరణ్ బాలీవుడ్ మూవీపై క్లారిటీ వచ్చేసింది!

రామ్ చరణ్ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తో మూవీ చేయబోతున్నాడనే ప్రచారం ఊపందుకుంది. గేమ్ ఛేంజర్ తర్వాత చెర్రీ బాలీవుడ్ చెక్కేస్తాడనే అన్నారు. మెగా ఫ్యాన్స్ తెగ సందడి చేశారు. ఎట్టకేలకు దీనిపై క్లారిటీ వచ్చేసింది…

ప్రస్తుతం ఇండస్ట్రీలో పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. భారీ బడ్జెట్ సినిమాలన్నీ కూడా ఆలోవర్ సినీ మార్కెట్ ను టార్గెట్ చేసుకుని వస్తున్నాయి. హిట్లూ కొడుతున్నాయి. సౌత్ నుంచి వచ్చిన మూవీలు నార్త్ లో.. నార్త్ నుంచి సినిమాలు సౌత్ లో గట్టిగానే వసూలు చేస్తున్నాయి. తెలుగు మేకర్స్ చాలామంది హిందీ హీరోలతో వర్క్ చేస్తున్నారు. కానీ అదే సమయంలో హిందీ దర్శకులు మాత్రం తెలుగు హీరోలతో సినిమాలు చేయడానికి అంతగా ముందుకు రావడం లేదనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక్కడు మాత్రమే వార్ 2 లో నటించే అవకాశం దక్కించుకున్నాడు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ హిరాని డిస్కషన్స్ కొనసాగుతున్నాయని అన్నారు.

నిజంగానే చెర్రీ ముంబైకి మాకాం మార్చాలనే ప్లాన్ లో ఉన్నాడట. అందుకు తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటున్నట్టు టాక్. అప్పుడెప్పుడో పదేళ్ళ క్రితం జంజీర్ సినిమాతో నార్త్‌కు వెళ్లినా పెద్దగా వర్కౌట్ కాలేదు. రీసెంట్ గా RRR తో మార్కెట్ తెచ్చుకున్నారు. ఇన్నేళ్ళ తర్వాత మరోసారి బాలీవుడ్‌పై ఫోకస్ చేశాడని టాక్. బీటౌన్ స్టార్ డైరెక్టర్లలో రాజ్ కుమార్ హిరానీ ఒకడు. కానీ డంకీ మూవీతో హిరానీ ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. హిరానీతో చెర్రీ మూవీ ఉండబోతోందనే ప్రచారం బాగా జరిగింది. ఈ వార్తలపై స్పందించిన హిరానీ అదేం లేదని క్లారిటీ ఇచ్చేశాడు. ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా వ్యక్తిగతంగా కలవలేదనేశాడు. అయితే చెర్రీతో మూవీ చేసే అవకాశం వస్తే సిద్ధమే అని హింట్ కూడా ఇచ్చాడు.

ప్రస్తుతానికి చరణ్-హిరానీ మూవీలేదన్న మాట మెగా అభిమానులను నిరాశపర్చినా..భవిష్యత్ లో ప్రాజెక్ట్ ఉండొచ్చంటూ హిరానీ ఇచ్చిన హింట్ అభిమానుల్లో జోష్ నింపుతోంది. అన్నట్టు చెర్రీ – ఉపాసన ముంబైలో ఇల్లు కొన్నారనే ప్రచారం కూడా జరుగుతోంది మరి. ప్రస్తుతం చరణ్.. శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ మూవీలో నటిస్తున్నాడు. కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తోంది..