గుణశేఖర్ మరోసినిమా అనౌన్స్ చేశాడు..ఈసారి అయినా!

అప్పట్లో స్టార్ డైరెక్టర్ అనిపించుకున్న గుణశేఖర్ కి ఆ తర్వాత టైమ్ అస్సలుబాలేదు. రీసెంట్ గా శాకుంతలం మూవీతో వచ్చి ఫెయిలైన గుణశేఖర్ ఇప్పట్లో సినిమా అనౌన్స్ చేసే ఛాన్స్ లేదనుకున్నారు..కానీ ఇలాంటి టైమ్ లో ఓ మూవీ అనౌన్స్ చేశాడు…టైటిల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది…

‘ఒక్కడు’, ‘చూడాలని వుంది’, ‘అర్జున్’ సినిమాలతో సూపర్ సక్సెస్ అందుకున్న గుణశేఖర్ కి ఆ తర్వాత సరైన సక్సెస్ లేదు. వాస్తవానికి దర్శకుడు గుణశేఖర్ అంటే మామూలుగా వైవిధ్యమైన సినిమాలు తీస్తాడంటారు. 2015లో ‘రుద్రమదేవి’ అనే ఒక చారిత్రాత్మక సినిమా తీసిన గుణశేఖర్ చాలా కాలంపాటు ఎలాంటి సినిమాలు చేయలేదు. ఎనిమిదేళ్ల తర్వాత ‘శాకుంతలం’ అనే పౌరాణిక సినిమాతో గతేడాది వచ్చినా ఫలితం లేదు. సమంత ఇందులో ప్రధాన పాత్రలో నటించింది..దేవ్ మోహన్ అనే మలయాళం నటుడు దుష్యంతుడిగా వేశారు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీతో చాలా నష్టాలొచ్చాయి. దీంతో మళ్ళీ బౌన్స్ బ్యాక్ ఇవ్వాలని హార్డ్ వర్క్ చేస్తున్నాడు. ట్రెండ్ కి తగ్గట్టు ఈ మూవీ ప్లాన్ చేస్తున్నాడట

‘యుఫోరియా’ పేరుతో రాబోతున్న ఈ సినిమా యువతను ఆకట్టుకునే సామాజిక అంశాలను టచ్ చేయనున్నాడట. గుణ హ్యాండ్‌మేడ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై నీలిమా గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. నటీనటులు, సాంకేతిక బృందం వివరాలు త్వరలోనే వెల్లడించనున్నట్లు మేకర్స్ తెలిపారు. యుఫోరియా సినిమా కథ ట్రెండ్ కి తగ్గట్టు ఉండనుందని టాక్. సాంకేతికంగా మరియు కథాపరంగా కొత్తదనం, వైవిధ్యం చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవాలని గుణశేఖర్ భావిస్తున్నాడు.

గుణశేఖర్ కెరీర్‌లో ఇది ఒక కీలకమైన మలుపు కానుంది. నిర్మాతగా కూడా రిస్క్ తీసుకునేందుకు సిద్ధమయ్యాడు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి